( గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి 08/11/2025 ) ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు క్యాన్సర్ వ్యాధిపై తగిన అవగాహన కలిగి ఉండాలని మెడికల్ ఆఫీసర్ పవన్కుమార్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ఎర్రగుంట్లపల్లె విలేజ్ హెల్త్ క్లీనిక్లో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు , సిబ్బంది ర్యాలీ నిర్వహించి, మానవహారం పాటించారు. డాక్టర్ మాట్లాడుతూ 30 సంవత్సరాలు పైబడిన వారు మూడు సంవత్సరాలకొక్కసారి వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు. పురుషులలో నోటిక్యాన్సర్, లలో రొమ్ము, సర్వైకల్ , నోటి క్యాన్సర్కు వచ్చే అవకాశం ఉందన్నారు. వెహోదటి దశలోనే గుర్తించి, నివారణ చేసుకోవడం మంచిదన్నారు. ఎలాంటి అనుమానాలు ఉన్న వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిహెచ్ఈవో మురళీబాబు, సిబ్బంది పాల్గొన్నారు.



