రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు విద్యార్థులు ఎంపిక

G Venkatesh
1 Min Read

గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి  : 10/11/2025

రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు మండలంలోని చండ్రమాకులపల్లెకి చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం వై.వెంకట్రమణ సోమవారం తెలిపారు. మదనపల్లె జెడ్పిహెచ్‌ఎస్‌ హైస్కూల్‌లో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో చండ్రమాకులపల్లెకి చెందిన పి.గానవి, 8వ తరగతి చెందిన విజయ్‌, గోవర్ధన్‌లు 7వతరగతికి చెందిన తేజశ్వని స్టాండ్‌బైగా ఎంపికైనట్లు తెలిపారు. ఈ విద్యార్థులు ఈనెల 19 నుంచి 21 వరకు గ్రీన్‌వ్యాల్యు గ్రౌండ్‌లో జరిగే రాష్ట్ర సంకలనంలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థుల ఎంపిక పట్ల హెచ్‌ఎంతో పాటు పిడి మురళిధర్‌, ఉపాధ్యాయులు వెంకట్రమణారెడ్డి, మణి, రమణమ్మ, శంకర్‌రెడ్డి, రఘు , ఎస్‌ఎంసి సభ్యులు , విద్యార్థులు అభినందించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *