
పాకాల మండలం, గరుడ న్యూస్ (ప్రతినిథి) : పాకాల మండలం గానుగపెంట ఉప సర్పంచ్ రవిని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరామర్శించారు. బుధవారం రాత్రి రవి కి చెందిన పాల కేంద్రాన్ని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు విషయం తెలుసుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రవి మాట్లాడుతూ ఎవరో కుట్రపూరితంగానే దగ్ధం చేశారని మోహిత్ రెడ్డికి తెలిపాడు. మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి దాడులు సంఘటనలు దురదృష్టకరమని దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితుడికి సరైన న్యాయం జరగకపోతే ప్రైవేట్ కేసులైన వేస్తామని తెలిపారు. దామల చెరువు పంచాయతీ బందార్లపల్లి నందు తుడా బెంచీలకు రంగులు మార్చటాన్ని అడ్డుకున్న కిరణ్ కరుణాకర్ అలాగే గ్రామంలో మంచినీటి సమస్య గురించి పంచాయతీ సిబ్బందితో గొడవ పడిన సంఘటనలో కుమారస్వామిరెడ్డి వాసుదేవరెడ్డి, నరేష్, విష్ణు, తులసి, భరత్,ప్రదీప్,రోజా, నిరోష లపై పాకాల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినందున కార్యకర్తల ఇండ్లకు వెళ్లి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరామర్శించారు. మీకు ఏమీ కాదని మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయి ఇస్తే సహించేది లేదని అటువంటి వారిపై ప్రైవేటు కేసులు కూడా వేస్తామని తెలిపారు .తుడా నిధులతో గత ప్రభుత్వంలో వేసిన పెంచిన రంగులు మార్చడం హేయమైన చర్య అని అందుకు సహకరిస్తున్న అధికారుల పైన చర్యలు తప్పవని తెలిపారు. అధికార పార్టీ నాయకులు మాటలు విని తప్పుడు కేసులు నమోదు చేసిన ఉద్యోగులు ఇబ్బంది పడకు తప్పదని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ లోకనాథం నాయకులు హరి ప్రసాద్ రెడ్డి,కపిలేశ్వర్ రెడ్డి భాస్కర్ నాయుడు,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లింగయ్య,ఖాదర్ వల్లి,హరీష్ రెడ్డి,భాను,గోపి తదితరులు పాల్గొన్నారు.


