
ఫిబ్రవరి 27,సాలూరు,(గరుడ న్యూస్)
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవక్షేత్రాలన్నీ హరిహర నామస్మరణతో హోరెత్తాయి.ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం సాలూరు పట్టణ శివారులోని వెంకటేశ్వర కాలనీ వద్ద ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి వారిని మాజీ డిప్యూటీ సీఎం పీడిక.రాజన్నదొర,రోజమ్మ దంపతులు దర్శించుకుని శివునికి ప్రత్యేక పూజలు చేశారు.

