పాకాల మండలంలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పర్యటన

Sesha Ratnam
1 Min Read

తిరుపతి జిల్లా, పాకాల, గరుడ న్యూస్ (ప్రతినిధి): పాకాల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ముందుగా ఉప్పరపల్లి పంచాయతీ మల్లెలచెరువుకు చెందిన వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఇంట జరిగిన వివాహ రిసెష్పన్ కు హాజరై నూతన వరుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, వధువు హిమబిందులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామస్తులతో కలసి విందు భోజనం చేశారు. అనంతరం చెన్నుగారిపల్లి గ్రామానికి చేరుకుని వైసీపీ నేత రమేష్ రెడ్డి తండ్రి మునస్వామిరెడ్డి దశ దిన కర్మక్రియల్లో పాల్గొని ఆ కుటుంబీకులకు ధైర్యం చెప్పారు.  ఈ పర్యటనలో హర్షిత్ రెడ్డి స్థానిక మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *