టిటిడి క్రీడా పోటీల్లో సీనియర్ ఆఫీసర్ క్రికెట్ విజేతలు

Sesha Ratnam
1 Min Read

తిరుపతి జిల్లా, గరుడ న్యూస్ (ప్రతినిధి):
టిటిడి ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడల్లో సీనియర్ ఆఫీసర్స్ క్రికెట్ పోటీలు SV హై స్కూల్ గ్రౌండ్ నందు జరిగింది.  ఈ క్రికెట్ పోటీలలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జున ప్రసాద్ గారి జట్టు విజయం సాధించింది.  రన్నర్స్ గా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మణ్ బాబు జట్టు నిలిచింది. స్కోర్ వివరాలు మొదట బ్యాట్టింగ్ చేసిన లక్ష్మణ్ బాబు జట్టు నిర్ణీత 15 ఓవర్ లలో 125 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.  ఆ జట్టు లో వెంకటేశ్వర్లు నాయుడు 50 పరుగులు సాధించారు, అనంతరం బ్యాట్టింగ్ చెప్పట్టిన మల్లికార్జున ప్రసాద్ జట్టు 14 ఓవర్ లకే 122 పరుగుల లక్ష్యం చేధించింది.  ఆ జట్టులో అడిషనల్ CV&SO శివకుమార్ రెడ్డి 35 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *