

ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా టిడిపి కార్యాలయం (ప్రజా వేదిక) నిలుస్తుంది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, పార్వతీపురం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పేర్కొన్నారు. శనివారం టిడిపి కార్యాలయం వద్ద ప్రజా వేదికలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పట్టణం నుంచి ప్రజానికం, మరియు పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యల అర్జీలను ఎమ్మెల్యే విజయ్ చంద్ర దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను విన్న ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు.

