నీటికాసుల వ్యాధి (గ్లకోమా) పై అవగాహన సదస్సు

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
4 Min Read

కంటి చూపును మెల్లగా హరించు వ్యాధి గ్లకోమా…..డా. భాస్కరరావు,జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి

Contents
శరీరం లో ఏ అవయవానికి భాధ కలిగించిన ఆ బాధ ను కల్లే వ్యక్త పరుస్తూ వుంటుంది.” సర్వెంద్రీయానాం నయనం ప్రధానం ” అనే సూక్తి అందరికీ తెలిసిందే. ప్రపంచం లో ప్రకృతి అందాలను కల్లున్న ప్రతీ ఒక్కరూ చూసి ఆరాధించి మధురానుభూతి పొందు తుంటారు. ఆ కళ్లే కనిపించక పోతే జీవితం అంధకార మవుతుంది. ప్రఖ్యాత రచయిత హెలెన్ కెల్లర్ మాటల్లో చెప్పాలంటే ” నాకు దేవుడు మూడు రోజులు కంటి చూపును ప్రసా దిస్తే చాలు మీరు ఎవరు జీవితం లో చూడలేనివి నేను మూడు రోజులు లో చూస్తానని అన్నారు. “ఐస్ ఆర్ విండోస్ ఆఫ్ ద సోల్” కళ్ళు తెరిస్తే ప్రపంచం మన ముందుంటుంది, ఆ కళ్ళే మూసుకుంటే అంతా అంధకారమే. కాబట్టి కంటి చూపుకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని జిల్లా కంటి వెలుగు నేత్ర వైద్య అధికారి జీరు నగేష్ రెడ్డి కోరారు.గ్లకోమా అంటే ఏమిటి:-గ్లకోమా(నీటికాసులు) అనేది కళ్ల కి సంబంధించిన వ్యాధి. కంటి యొక్క డ్రైనేజ్ నిర్మాణాలు సరిగ్గా పనిచేయక పోవడం వలన కంటి లోపల పీడనం పెరిగి ఆప్టిక్ నరానికి హానీ కలిగిస్తుంది. గ్లకోమా ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించక పోయినా క్రమేణా చూపు కోల్పోవచ్చు.ఈ వ్యాధి బారిన పడిన చాలామందికి వ్యాధి వచ్చినట్లు తెలియదు.దీనిని తెలుసుకొన నిచో లేదా చికిత్స చేయించు కొననిచో శాశ్వతంగా చూపు కోల్పోవచ్చు. ప్రధమంగా ఈ వ్యాధి ని కంటి ఒత్తిడి నీ పరీక్షించి గుర్తించ వచ్చు. ఈ ప్రక్రియనే “ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్” అంటారు. ఆరోగ్యకరమైన కన్ను అక్వియస్ అనే ద్రవ పదార్థాలు ఉత్పత్తి చేస్తుంది.మరియు అదే స్థాయి లో డ్రైన్ చేస్తుంది.ఈ డ్రైనేజ్ ప్రక్రియ ను అడ్డుకోబడినప్పుడు అధిక ఒత్తిడి వచ్చి ద్రవం సాధారణ స్థాయిలో బయటకు వెళ్లదు. దీని ద్వారా పెరిగిన ఒత్తిడి ఆప్టిక్ నరానికి ఎదురుగా తోస్తుంది. తద్వారా కన్ను కి నష్టం కలిగే అవకాశం ఉంది. దీని వల్ల క్రమ క్రమంగా కంటి చూపు కోల్పోవచ్చు.గ్లకోమా ఎవరికి వస్తుంది:-కుటుంబం లో గ్లకోమా చరిత్ర వున్నవారికి(వంశ పారంపర్యంగా),మధు మేహ వ్యాధి వున్నవారికి,బి.పి వున్నవారికి(రక్త పోటు), దీర్ఘ కాలిక స్టెరాయిడ్స్ వాడకము వున్నవారికి, ప్రమాదాలలో కంటికి గాయాలు అయినప్పుడు.గ్లకోమాను ఎలా కనుగొనవచ్చు:-గ్లకోమాను కనుగొనడానికి కంటి వైద్యుడి చే పూర్తి పరీక్షలు చేయించు కోవడం ఉత్తమ మార్గం. సంపూర్ణ కంటి పరీక్షలో కంటి ఒత్తిడి (ఐ. ఓ. పి) కొలత,కంటి డ్రైనేజ్ ప్రక్రియ మరియు ఆప్టిక్ నరాన్ని పరీక్షించడం,కంటి విజువల్ ఫీల్డ్ పరీక్షలు ద్వారా కంటి చూపు నీ పరీశీలించి గ్లకోమా ను గుర్తిస్తారు.ఈ సృష్టిలో మానవునికి అన్నిటికంటే అపురూపమైనది, ప్రాధాన్యత కలది దృష్టి. కంటి వెలుగు లేకపోవడం అనేది ఒక శాపం. ఈ రోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్య విభాగం మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా గ్లకోమ వ్యాధి పై అవగాహన సదస్సు,నివారణ చర్యలు,నేత్ర పరీక్షలునేత్ర వైద్య అధికారి నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికరి డాక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కంటి ఆరోగ్యం సంరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యముగా రక్త పోటు వున్నవారు గ్లకోమ పరీక్షలు చే యించుకోవడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది మార్చి 2 వ వారం వారోత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్య అధికారి నగేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు ప్రకారం అందత్వ కేసుల్లో 5 శాతం గ్లకోమ అంధత్వం ఆక్రమించి ఉన్నదని తెలుపుతుంది. మనదేశంలో 68 లక్షల మంది ఒకటి లేదా రెండు కళ్ళలో అంధత్వంతో బాధపడుతున్నట్టు, వీరిలో 10 లక్షల మంది రెండు కళ్ళు కూడా అంధత్వం వలన పూర్తిగా దృష్టి కోల్పోయారని అన్నారు. నేత్ర వైద్య నిపుణులు డా వెంకటేష్ మట్లాడుతూ వ్యాధి లక్షణాలు వున్నప్పుడు సకాలంలో సరైన చికిత్స పొందకపోవడం వలన, నిర్లక్ష్యం చేయడం వల్ల శాశ్వతంగా అంధత్వం పొందుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నేత్ర పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో ఆప్తలమిక్ అధికారులు మరియు నేత్ర సహాయకులు ద్వారా నేత్రదానంపై అవగాహన సదస్సులు, ర్యాలీలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా నేత్ర వైద్య అధికారి నగేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డా శ్యామల, డా విజయమోహన్ జిల్లా ఎన్ జి ఓ అధ్యక్షులు కిషోర్, నేత్ర వైద్య అధికారి శ్రీనివాసరావు హెడ్ నర్స్ భారతి మరియు ప్రజలు పాల్గొన్నారు.

శరీరం లో ఏ అవయవానికి భాధ కలిగించిన ఆ బాధ ను కల్లే వ్యక్త పరుస్తూ వుంటుంది.
” సర్వెంద్రీయానాం నయనం ప్రధానం ” అనే సూక్తి అందరికీ తెలిసిందే. ప్రపంచం లో ప్రకృతి అందాలను కల్లున్న ప్రతీ ఒక్కరూ చూసి ఆరాధించి మధురానుభూతి పొందు తుంటారు. ఆ కళ్లే కనిపించక పోతే జీవితం అంధకార మవుతుంది. ప్రఖ్యాత రచయిత హెలెన్ కెల్లర్ మాటల్లో చెప్పాలంటే ” నాకు దేవుడు మూడు రోజులు కంటి చూపును ప్రసా దిస్తే చాలు మీరు ఎవరు జీవితం లో చూడలేనివి నేను మూడు రోజులు లో చూస్తానని అన్నారు. “ఐస్ ఆర్ విండోస్ ఆఫ్ ద సోల్” కళ్ళు తెరిస్తే ప్రపంచం మన ముందుంటుంది, ఆ కళ్ళే మూసుకుంటే అంతా అంధకారమే. కాబట్టి కంటి చూపుకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని జిల్లా కంటి వెలుగు నేత్ర వైద్య అధికారి జీరు నగేష్ రెడ్డి కోరారు.

గ్లకోమా అంటే ఏమిటి:-
గ్లకోమా(నీటికాసులు) అనేది కళ్ల కి సంబంధించిన వ్యాధి. కంటి యొక్క డ్రైనేజ్ నిర్మాణాలు సరిగ్గా పనిచేయక పోవడం వలన కంటి లోపల పీడనం పెరిగి ఆప్టిక్ నరానికి హానీ కలిగిస్తుంది. గ్లకోమా ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించక పోయినా క్రమేణా చూపు కోల్పోవచ్చు.ఈ వ్యాధి బారిన పడిన చాలామందికి వ్యాధి వచ్చినట్లు తెలియదు.దీనిని తెలుసుకొన నిచో లేదా చికిత్స చేయించు కొననిచో శాశ్వతంగా చూపు కోల్పోవచ్చు. ప్రధమంగా ఈ వ్యాధి ని కంటి ఒత్తిడి నీ పరీక్షించి గుర్తించ వచ్చు. ఈ ప్రక్రియనే “ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్” అంటారు. ఆరోగ్యకరమైన కన్ను అక్వియస్ అనే ద్రవ పదార్థాలు ఉత్పత్తి చేస్తుంది.మరియు అదే స్థాయి లో డ్రైన్ చేస్తుంది.ఈ డ్రైనేజ్ ప్రక్రియ ను అడ్డుకోబడినప్పుడు అధిక ఒత్తిడి వచ్చి ద్రవం సాధారణ స్థాయిలో బయటకు వెళ్లదు. దీని ద్వారా పెరిగిన ఒత్తిడి ఆప్టిక్ నరానికి ఎదురుగా తోస్తుంది. తద్వారా కన్ను కి నష్టం కలిగే అవకాశం ఉంది. దీని వల్ల క్రమ క్రమంగా కంటి చూపు కోల్పోవచ్చు.
గ్లకోమా ఎవరికి వస్తుంది:-
కుటుంబం లో గ్లకోమా చరిత్ర వున్నవారికి(వంశ పారంపర్యంగా),మధు మేహ వ్యాధి వున్నవారికి,బి.పి వున్నవారికి(రక్త పోటు), దీర్ఘ కాలిక స్టెరాయిడ్స్ వాడకము వున్నవారికి, ప్రమాదాలలో కంటికి గాయాలు అయినప్పుడు.
గ్లకోమాను ఎలా కనుగొనవచ్చు:-
గ్లకోమాను కనుగొనడానికి కంటి వైద్యుడి చే పూర్తి పరీక్షలు చేయించు కోవడం ఉత్తమ మార్గం. సంపూర్ణ కంటి పరీక్షలో కంటి ఒత్తిడి (ఐ. ఓ. పి) కొలత,కంటి డ్రైనేజ్ ప్రక్రియ మరియు ఆప్టిక్ నరాన్ని పరీక్షించడం,కంటి విజువల్ ఫీల్డ్ పరీక్షలు ద్వారా కంటి చూపు నీ పరీశీలించి గ్లకోమా ను గుర్తిస్తారు.
ఈ సృష్టిలో మానవునికి అన్నిటికంటే అపురూపమైనది, ప్రాధాన్యత కలది దృష్టి. కంటి వెలుగు లేకపోవడం అనేది ఒక శాపం. ఈ రోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్య విభాగం మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా గ్లకోమ వ్యాధి పై అవగాహన సదస్సు,నివారణ చర్యలు,నేత్ర పరీక్షలునేత్ర వైద్య అధికారి నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికరి డాక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కంటి ఆరోగ్యం సంరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యముగా రక్త పోటు వున్నవారు గ్లకోమ పరీక్షలు చే యించుకోవడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది మార్చి 2 వ వారం వారోత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్య అధికారి నగేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు ప్రకారం అందత్వ కేసుల్లో 5 శాతం గ్లకోమ అంధత్వం ఆక్రమించి ఉన్నదని తెలుపుతుంది. మనదేశంలో 68 లక్షల మంది ఒకటి లేదా రెండు కళ్ళలో అంధత్వంతో బాధపడుతున్నట్టు, వీరిలో 10 లక్షల మంది రెండు కళ్ళు కూడా అంధత్వం వలన పూర్తిగా దృష్టి కోల్పోయారని అన్నారు. నేత్ర వైద్య నిపుణులు డా వెంకటేష్ మట్లాడుతూ వ్యాధి లక్షణాలు వున్నప్పుడు సకాలంలో సరైన చికిత్స పొందకపోవడం వలన, నిర్లక్ష్యం చేయడం వల్ల శాశ్వతంగా అంధత్వం పొందుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నేత్ర పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో ఆప్తలమిక్ అధికారులు మరియు నేత్ర సహాయకులు ద్వారా నేత్రదానంపై అవగాహన సదస్సులు, ర్యాలీలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా నేత్ర వైద్య అధికారి నగేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డా శ్యామల, డా విజయమోహన్ జిల్లా ఎన్ జి ఓ అధ్యక్షులు కిషోర్, నేత్ర వైద్య అధికారి శ్రీనివాసరావు హెడ్ నర్స్ భారతి మరియు ప్రజలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *