
గోదావరి జిల్లా, గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామం వద్ద ఇసుక లోడింగ్ కి వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి. కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక లోడింగ్ కి వెళుతున్న లారీ ఢీకొని జరిగే మరణాల సంఖ్య రోజుకి పెరుగుతుంది మితిమీరిన వేగంతో వెళుతున్న ఈ టిప్పర్ లారీల వల్ల ప్రజలు అరచేతుల ప్రాణాలు పెట్టుకుని రోడ్డుపై ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పోలీసులు రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ ఇసుక లారీల రవాణాను అరికట్టకపోతే మరెన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.


