
గరుడ న్యూస్,సాలూరు రూరల్
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం ఖరాసవలస గ్రామంలో పి. ఎం. డి. ఎస్ నవధాన్యాలు రీజనల్ టెక్నికల్ లీడ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రౌండింగ్ చేయటం జరిగింది. ఈ విధంగా రైతులు అందరు నవధాన్యాలు చల్లకోవాలని తెలియజేసే అవగాహన కల్పించటం జరిగింది.పి ఎమ్ డి ఎస్ నవధాన్యాలు వలన భూసారం పెరుగుతుందని భూమిలో జీవ వైవిద్యం పెరుగుతుందని అనేక రకాల విత్తనాలు వెయ్యటం వలన అనేక రకాల మొక్క వేరు వ్యవస్థ లో అనేక రకాల సూక్ష్మ జీవులు ఉంటాయని నవధాన్యాలు వలన వేరు వ్యవస్థ వలన నేల గుల్ల బారి సేంద్రియ కర్బణం వృద్ధి చెందుతుందని యూరియా డి. ఏ.పి అవసరం లేదని, పర్యావరణం పాడవకుండా ఉంటుందని ఆరోగ్యకరమైన పంటలు పండించి తినటం వలన ఆరోగ్యం పాడవకుండా ఉంటుందని, నవధాన్యాలు వేయటం వలన అదనపు ఆదాయం పొందవచ్చని పశువులు మేత అందుతుందని
, పశువుల పాల ఉత్పత్తి పెరుగుతుందని,నవధాన్యాలు వేసిన నలభై రోజుల తరువాత కలియ దున్నటం వలన ప్రధాన పంటకు కావలసిన పోషకాలు అభివృద్ధి చెందుతాయని
, ప్రధాన పంటలో కలుపు నివారణ అవుతుంది అని రీజనల్ టెక్నికల్ లీడ్ ఆఫీసర్ రైతులుకు చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

