
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే08,(గరుడ న్యూస్):
సింధూర్ పేరుతో భారత సైన్యం చేస్తున్న పోరాటానికి సెల్యూట్,పహల్గాం లో జరిగిన మారణ హోమానికి భారత దేశం ప్రతికరం తీర్చుకుందని భారతదేశ సైనికుల ధైర్య సాహసాలను ఈ సందర్భంగా మెచ్చుకున్నారు నారాయణపురం బిజెపి మండల అధ్యక్షులు సుర్వి రాజ్ గౌడ్.ఈ సందర్భంగా గురువారం రోజు మీడియాతో మాట్లాడుతూ భారత దేశ త్రివిధ దళాలు పాకిస్థాన్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో శత్రుసేనలకు చెందిన 9 తొమ్మిది స్థావరాలపై చేసిన దాడులు విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని తుదముట్టించే ప్రక్రియలో త్రివిధ దళాలు చూపిన ధైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తున్నదని కొనియాడారు.యావత్ భారత ప్రజలు సైన్యా నికి అండగా ఉన్నామని అన్నారు.భారతదేశం పేరు చెప్తేనే పాకిస్తాన్ వనికేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఆయన కొనియాడారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి,ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,కి కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.
