శ్రీ బోయకొండలో రాహుకాల అభిషేకం అన్నదానానికి విశేష స్పందన..

G Venkatesh
1 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం మైన శ్రీ  బోయకొండ గంగమ్మ దేవస్థానం లో శుక్రవారం లోకసుభిక్షం కోరుతూ రాహుకాల అభిషేకాన్ని సాంప్రదాయ పద్దతిలో నిర్వహించారు.ఉదయాన్నే ప్రధాన అర్చకులు వేదపండితుల వేదమంత్రాలతో అమ్మవారికి ప్రత్యేకలంకరణ చేసి,విశిష్టాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో భక్తులు, ఆలయ కార్మనిర్వాహణాధికారి,ఉపకమీషనర్ జే.ఏకాంబరం,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.అమ్మవారి ఆశిస్సులకోసం వచ్చే భక్తుళకు ప్రతి శుక్రవారం అన్నదానం చేయడం ఆనవాయితీ గా వస్తుంది.ప్రతి వారము అమ్మవారి చే కోర్కెలు తీర్చబడిన భక్తులు దేవస్థానం ఆద్వర్యం లో అన్నదానం నిర్వహిస్తున్నారని,ఎవరైనా భక్తులు అన్నదానం చేయదలచిన వారు,విరాలాళ్ళు ఇవ్వదలచిన వాళ్ళు పరిపాలనా భవణం లోసంప్రదించవచ్చునని,ఇచ్చిన విరాలాళ్ళు కు తగిన రసీదును పొందాలని ఈ.ఓ ఏకాంబరం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తాదులు సిబ్బంది పాల్గొన్నారు..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *