
గరుడ న్యూస్,సాలూరు రూరల్
పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం, మామిడిపల్లి గ్రామంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి 21 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి శంకుస్థాపన చేశారు. రైతులకు రుణాలు, పెట్టుబడులు అందించడంలో ఈ సంఘం తోడ్పడుతుందని, గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి ఇది మద్దతు ఇస్తుందని ఆమె తెలిపారు.

