
గరుడ ప్రతినిధి పుంగనూరు

చౌడేపల్లి మండలం లోని చారాల గ్రామ పంచాయతీ చారాల యస్సి కాలనీ సమీపంలో గల బోర్ వెల్ రూము వద్ద ప్రమాదకర పరిస్థితిలో ట్రాన్స్ ఫార్మర్.గ్రామానికి కూత వేటు దూరంలోనే బోర్ వెల్ రూము ఉంది.అక్కడికి ప్రతిరోజు మంచినీరు వదలడానికి వెళ్తుంటారు,వస్తుంటారు.ఐతే ఊరు కోసం ఏర్పాటు చేసిన సింగిల్ ఫేస్ ట్రాన్స్ ఫార్మర్,అలాగే బోరు కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్,రెండింటి చుట్టూ ముళ్ళచెట్లు పెరిగాయి, అధికారులు ముళ్ళు కంపలు ,తిప్పతీగలు తీగలు పై అల్లుకోక మునుపే తొలగించాల్సిన అవసరం ఉంది.అంతే కాకుండా ఇదే ట్రాన్స్ ఫార్మర్ కు దాదాపు మూడు వందల మీటర్ల కేబుల్ వేశారు.కేబుల్ వైర్లుకూడా చేతికందే ఎత్తులో ఉన్నాయి.ఈ విషయమై విద్యుత్ అధికారులకు ఇదివరకే రెండుమూడు పర్యాయాలు తెలియజేయడం జరిగింది.ఐనా సదరు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం గమనార్హం.ఇకనైనా విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ ఫార్మర్ చుట్టుప్రక్కల ముళ్ళు కంపలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.