
తిరుపతి జిల్లా, పాకాల మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): రాజేష్:
వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత రవీంద్రనాథ్ రెడ్డికి మాతృ వియోగం-కర్మక్రియలకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి. చిన్నగొట్టిగల్లు మండలం బత్తినవారిపల్లిలో నివాసముంటున్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రవీంద్రనాథ్ రెడ్డి తల్లి మేకల ఈశ్వరమ్మ ఈనెల14వ తేదీన మరణించారు. అనంతరం 24వ తేదీన శనివారం జరిగిన దశదిన కర్మక్రియలకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు హాజరయ్యారు. ఈశ్వరమ్మ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం అక్కడకు వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరినీ పలుకరించారు. ఈశ్వరమ్మకు నివాళులు అర్పించిన వారిలో చిన్నగొట్టిగల్లు మండల ఎంపీపీ యుగంధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సింహాల మోహన్ తో పాటు ముఖ్యనేతలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


