
తిరుపతి జిల్లా, గరుడ న్యూస్ ( ప్రతినిధి): తిరుపతి రూరల్ మండలం తణపల్లి గ్రామంలో జరుగుతున్న గంగమ్మ జాతరకు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి సారెను సమర్పించారు. బుధవారం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి గంగమ్మ జాతరకు సారెను తీసుకువెళ్లిన ఆయన తణపల్లి గ్రామంలో జాతర నిర్వాహకులకు అందజేశారు. గ్రామంలోకి వచ్చిన చెవిరెడ్డి సారెకు మహిళలు కర్పూర హారతులు అందించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నడివీధి గంగమ్మకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా గ్రామంలో ఆలయం వద్దకు వచ్చిన మహిళలు, పెద్దలు అందరినీ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆప్యాయంగా పలుకరిస్తు జాతర మహోత్సవంలో పాలు పంచుకున్నారు. సారె సమర్పించిన వారిలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డితో పాటు వైస్ఎంపీపీ మాదవరెడ్డి, తణపల్లి గ్రామ పంచాయతీ పార్టీ అధ్యక్షుడు విజయ్ సింహ రెడ్డి, పార్టీ నేతలు దశరథ రామిరెడ్డి, హేమంత్ రెడ్డి, మల్లిఖార్జున రెడ్డి, హరి, సూరి తదితరులు వున్నారు.


