గనుమగట్టుపల్లెలో విషాదం..షార్ట్ సర్క్యూట్ తో మరణించిన గృహిణి..

Sesha Ratnam
1 Min Read

తిరుపతి జిల్లా పాకాల మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): గనుమగట్టు పల్లెలో విద్యుత్ ప్రమాదం.. దీనిని ప్రమాదం అనాలా ? లేదా అధికారుల నిర్లక్ష్యం అనాలా ? అనేది అర్థం కాని పరిస్థితి! కారణం ఒక గృహిణి ప్రమాదవశాత్తు మృత్యు బారిన పడడం.. ఆమె ఒక సాధారణ గృహిణి, ఎప్పటిలాగే ఇంటి పని వంట పని చేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఇంట్లో ఉండే ఆ గృహిణి ఉన్నచోటనే మృత్యువు కబలిస్తుంటే ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో, ఎవరికి చెప్పుకోవాలో లో అని దుస్థితిలో, ఉన్నచోటనే కుప్పకూలి ప్రాణం విడిచిన ఘటన పాకాల మండలం గనుమ ఘట్టపల్లిలో చోటుచేసుకుంది. ఆమె కరెంటు జోలికి పోలేదు, కరెంటు పోల్ ను కూడా టచ్ చేయలేదు. కానీ కరెంట్ షాక్ కు గురి కావడం క్షణాల్లో ప్రాణాలు పోవడం జరిగింది. చూసినవారు సహాయం చేసే అవకాశం, సమయం కూడా ఇవ్వలేదు ఆ కరెంటు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ ఉన్న ఇళ్లల్లో కరెంటు పాస్ అవ్వడం వలన ఈ ఘటన జరిగినట్లుగా స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ అకస్మాత్ ఘటనతో గనుమగట్టుపల్లి ప్రాంతమంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. ఇకనైనా విద్యుత్ అధికారులు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *