
గరుడ న్యూస్,సాలూరు
సైకో పాలన పోయింది సైకిల్ పాలన వచ్చింది…..
అంటూ సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు జూన్ 4 బుధవారం ఉదయం పార్టీ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఐదేళ్ల వికృత పైశాచిక రాక్షస పాలనకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో చరమగీతం పాడి సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ ఒకేసారి తీసుకువచ్చారని గతాన్ని గుర్తు చేసుకున్నారు వైసీపీ ప్రభుత్వం వెన్నుపోటు దినంగా జరుపుకోవడం విచిత్రంగా ఉందని ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారని ప్రజా తీర్పును అవమానిస్తారా అని ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు (చిట్టి) వి. శోభారాణి, మోయుధ వైదేహి అక్యాన రాధ, బి. బాలామణి తదితరులు పాల్గొన్నారు.

