యోగాతో సంపూర్ణ ఆరోగ్యం చంద్రగిరి డిఎస్పి ప్రసాద్

Sesha Ratnam
1 Min Read
యోగా పై అవగాహన ర్యాలీ నిర్వహించిన తిరుచానూరు పోలీస్ వారు

తిరుచానూరు, గరుడ న్యూస్ (ప్రతినిధి): హరికృష్ణ: ప్రతిరోజు యోగ చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం వర్తిస్తుందని చంద్రగిరి డిఎస్పి ప్రసాద్ తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ అన్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు తిరుచానూరులో యోగాంధ్ర అని కార్యక్రమం భాగంలోని తిరుచానూరు పోలీస్ స్టేషన్ నుంచి సింధు జంక్షన్ వరకు తిరుచానూరు స్థానికులతో కలిసి యోగా అవగాహన ర్యాలీ నిర్వహించినారు. చంద్రగిరి డిఎస్పి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని నిత్యం యోగ ప్రతి ఒక్కరూ ఆచరించే వారికి మానసిక దృఢంతోపాటు మంచి ఆలోచనలు వస్తాయని ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు యోగా చేయాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ ఎస్సై సాయిరాం చౌదరి ఏఎస్ఐలు మురళి హలీయమ్మ రైటర్ శ్రీనివాసులు ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *