

కడప జిల్లా, బ్రహ్మంగారిమఠం మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): A. ఓబుల్ రెడ్డి: కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం లో పదవ తరగతి లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేస్తున్న షైనింగ్ స్టార్స్ అవార్డులువిద్యార్తుల ఉన్నత చదువులు ఉజ్వల భవిష్యత్తు కి ప్రోత్సాహాన్ని అందిస్తాయని meo పుల్లయ్య, ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ స్వామి రెడ్డి, తెలుగు ఉపాధ్యాయులు కొండారెడ్డి అన్నారు.2024-25విద్యా సంవత్సరానికి గాను మండలంలో ఉత్తమ ఫలితాలు సాధించిన 10వ తరగతి ఏడు మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్ గా ఎంపిక చేసింది.వీరికి స్థానిక గోవింద మాంబా జిల్లా పరిషత్ బాలుకోన్నత పాఠశాలలో పురస్కారాల ప్రదానం చేశారు.ఒక్కొకరికి 20 వేలు చొప్పున చెక్కును ప్రశంసా పత్రాలను meo పుల్లయ్య అందించారు.


