చిరుత దాడిలో దూడ మృతి

Ashok kumar
1 Min Read


గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 11

చిరుత దాడిలో దూడ మృతి చెందిన సంఘటన బుధవారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది చౌడేపల్లి పరిధిలోని గోసల గురప్పల్లికి చెందిన కుమార్ అతని కుటుంబంతో సమీపంలోని అంకాలమ్మ కొండ వద్ద కాపురం ఉంటున్నారు ఈ క్రమంలో మంగళవారం రాత్రి వర్షం కురిచేయడంతో పశువులను పాకలో కట్టేసి గోసలకూరపల్లికి వచ్చేశారు తెల్లవారి వెళ్లి చూడగా ఓ దూడను చిరుత చంపి తినేసి వెళ్లిపోయింది ఈ మేరకు ఫారెస్ట్ అధికారిని ఇంద్రాణి పంచనామా చేయగా పశువైద్యాధికారి పవన్ పోస్టుమార్టం నిర్వహించి దూడను ఖననం చేశారు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గల రైతులందరూ చిరుత పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారిని ఇంద్రాణి తెలిపారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రభాకర్  పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *