
గరుడ న్యూస్ పుంగనూరు మండలం లక్ష్మీపురం కాలనీ సమీపంలో స్వాతంత్ర సమరయోధుడు. పుంగనూరు నియోజవర్గ తొలి శాసనసభ్యులు.బడల కృష్ణమూర్తి రావుకు. లక్ష్మీపురం కాలనీ సమీపంలో ఒక ఎకరం 25 సెంట్లు వ్యవసాయ భూమి కలదు. వ్యవసాయ పొలానికి వెళ్లే దానిని కొంతమంది ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో శనివారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో స్వాతంత్ర సమరయోధుని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడి కుటుంబ సభ్యుడు. ప్రసాద్ స్వామి మాట్లాడుతూ దారి ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని. తమ పూర్వీకుల భూమికి దారి కల్పించాలని కోరారు.
