ఏకకాలంలో రైతు భరోసా చారిత్రాత్మక ఘట్టంకాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి,మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి నాయకులు

Garuda Tv
1 Min Read

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,జూన్18,(గరుడ న్యూస్):

రైతు సంక్షేమమే పరమావధిగా భావించి అన్నదాతల ఖాతాల్లో ఏకకాలంలో  9వేల కోట్ల రూపాయలను జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఇది చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టం గా మిగిలిపోతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి,సంస్థాన్ నారాయణపురం మండలం మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి పేర్కొన్నారు.రైతు నేస్తం  ప్రారంభ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1031 రైతు  వేదికలలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,నేరుగా మాట్లాడడం ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధతను చాటుతోందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమము విజయవంతం అయందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉందని,రుణమాఫీ,రైతు భరోసా,సన్న వడ్లకు బోనస్,రాయితీపై పనిముట్లు,తుంపర సేద్యం పనిముట్లు,బిందు సేద్యం పనిముట్లు,రాయితీ విత్తనాలు, రాయితీ పంపుసెట్లు,అనేక పథకాల ద్వారా నేడు అన్నదాతలకు లబ్ధి చేకూరుస్తోందని తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *