మీకే మేము సంస్థ ఆధ్వర్యంలో మంత్రి సంధ్యారాణి కి సేవా పురస్కార సత్కారం

Bevara Nagarjuna
1 Min Read


సాలూరు, జూన్ 19,గరుడ న్యూస్ ప్రతినిధి: నాగార్జున

శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగను 14 సంవత్సరాల తర్వాత తీసుకుని వచ్చి ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందడుగు వేసి ప్రజల మన్ననలు పొందిన  మంత్రి సంధ్యారాణి  అధికారులను,ప్రజలను, మరియు నాయకులను నడిపించి పండగ మహోత్సవాన్ని దిగ్విజయంగా జరిపించారు.  సుమారు పది లక్షల మంది జనాలు అమ్మవారి పండగ హాజరవుతారని  ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేశారు.
ఎక్కడ ఎటువంటి ప్రాణహాని జరగకుండా సురక్షితంగా  పండగ జరిగింది. అధికారులను ప్రజలను సంఘటితం చేస్తూ ఐకమత్యంగా పండగ విజయవంతం చేయించారు. స్ర్తీ,శిశు సంక్షేమ శాఖ& గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి సేవను ప్రత్యక్షంగా గుర్తించిన మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ వారు 5వ వార్షికోత్సవం  సందర్భంగా  సేవా పురస్కారం తో సత్కరించారు.

  కార్యక్రమంలో మీకై మేము వెల్ఫేర్ సంస్థ సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *