
పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి పంచాయతీ నందు గ్రామ కమిటి అధ్యక్ష కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.కార్యక్రమానికీ ముక్య అతిధులుగా నియోజకవర్గ పరిశీలకులు దేవి రెడ్డి శ్రీనివాస్,మండలం తెలుగుదేశం అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి విచ్చేసారు. నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరము కొత్తగా ఎన్నుకోబడిన గ్రామా కమిటీ అధ్యక్షులను మరియు కమిటీ సభ్యులను సత్కరించి వారికి దిశ, నిర్దేశం చేసి పార్టీ బలోపేతానికి క్రుషి చేసేవిధంగా సలాహాలు సూచనలు తెలియజేసారు.కార్యక్రమములో మండల నాయకులు, కార్యకర్తలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
