

తిరుపతి జిల్లా, తిరుచానూరు గరుడ న్యూస్ (ప్రతినిధి): హరికృష్ణ: తిరుపతి రూరల్ మండలం ముళ్లపూడి గ్రామంలో 45వ వార్షిక శ్రీకృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజుల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య రేవతి నక్షత్రం లగ్నమందు ధర్మరాజుల స్వామి ఆలయం ముందు ధ్వజవారోహణము వైభవంగా నిర్వహించినారు. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం నుంచి 15 రోజులు పాటు మహాభారత ఉత్సవాలు జరగనున్నాయి. అనంతరం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మహాభారత ఉత్సవాల సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హరికథ రాత్రి వీధి నాటకం ఉంటుందని జూన్ 20వ తేదీ నుండి జూలై ఆరో తేదీ వరకు శ్రీకృష్ణ లీలలు, పాండవ జననం, ద్రౌపతి కళ్యాణం, కీచక వద, ద్రౌపది వస్త్రాహరణం, శ్రీ శ్రీకృష్ణరాయబారం, దుర్యోధన వద, పాండవ వనవాసం, కర్ణ జననం, భీష్మ ప్రతిజ్ఞ, కదా ఘటము, అగ్నిగుండం కార్యక్రమం నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ద్రౌపతి ధర్మరాజుల వారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఉత్సవ విగ్రహాలకు వివిధ పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


