పుంగనూరులో టీసీలు ఇవ్వకుండ వేదింపులు

G Venkatesh
1 Min Read

పుంగనూరు_గరుడ న్యూస్ పుంగనూరు పట్టణంలోని కొత్తయిండ్లు మున్సిపల్‌ హైస్కూల్‌లో 10వ తరగతి పాసైన విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండ వేదిస్తుండటంతో తల్లిదండ్రులు , విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు , కళాశాలలు తెరిచి వరం రోజులు కావస్తున్న టీసీలు ఇవ్వకుండ హెచ్‌ఎం కాలయాపన చేస్తున్నారని , అడిగితే 100 మంది విద్యార్థులకు రాయాలి కదా అని దురుసుగా మాట్లాడుతున్నారంటు ఆరోపిస్తున్నారు. కళాశాలలో అడ్మీషన్లు జరుగుతుండటంతో తమకు నచ్చిన కళాశాలలో చేరేందుకు టీసీలు లేకపోవడంతో తీవ్రంగా మానసిక వేదనకు గురౌతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌, అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని టీసీలు ఇప్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *