
గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండల వ్యవసాయ అధికారిగా మోహన్ పదవి బాధ్యతలు చేపట్టారు గతములు ఇక్కడ పనిచేస్తున్న జ్యోతి పుంగునూరుకు బదిలీ కాగా అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం వ్యవసాయ అధికారిగా ఉన్న మోహన్ చౌడేపల్లి కు బదిలీపై వచ్చాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌడేపల్లి మండలంలో గతంలో పది సంవత్సరాలు విధులు నిర్వహించానాని మండల వ్యాప్తంగా రైతులు, నాయకులు సుపరిచితులేనని ప్రభుత్వం ద్వారా మంజూరయ్యే సబ్సిడీ ద్వారా అందించే సంక్షేమ పథకాలన్నీ సకాలంలో రైతులకు తెలియజేసి నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేస్తానన్నారు ఏ కార్తుల్లో ఏ విత్తనాలు విత్తాలో రైతులకు సలహాలు సూచనలు ఇచ్చి రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచి సకాలంలో పంపిణీ చేసి రైతులకు ఎటువంటి అసౌక్యాలు కలగకుండా తగు చర్యలు తీసుకుంటానన్నారు మండలంలోని అన్ని సచివాలయాలలో రైతులు ఎరువులు, విత్తనాలు నిల్వ ఉంచుతానన్నారు మండలంలోని ప్రైవేట్ ఎరువుల దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తానన్నారు
