లయన్స్ క్లబ్‌ మీడియా చైర్‌ పర్సన్ గా సతీష్‌రాజు

G Venkatesh
1 Min Read

గరుడ న్యూస్ పుంగనూరు. చిత్తూరు జిల్లా, పుంగనూరు నందు ప్రజలకు లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా డయాలసిస్, కంటి వైద్య శిభిరం,రక్త దాన శిబిరం,లియో క్లబ్ ద్వారా విద్యార్థులకు చెస్ ఛాంపియన్స్ గా గ్రాండ్ మాస్టర్స్ గా నిలబెడుతూ ప్రజలకు అత్యంత సేవలు అందిస్తూన్నది.నేడు 2025-2026కమిటీ అధ్యక్షుల ప్రమాణస్వీకారం సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశం లో లయన్స్ క్లబ్ సేవలను గత మూడు సంవత్సరాలు గా లయన్ మెంబెర్ గా లయన్ సతీష్ కుమార్ రాజు ఎప్పటికప్పుడు లయన్స్ సేవలను ప్రజలకు, పత్రిక,మీడియా రంగం లో పనితీరును గుర్తించి లయన్ డిస్ర్టీక్ట్ అంబాసిడర్ డా. పి.శివ,డైరెక్టర్లు వరదా రెడ్డి, ముత్యాలు ల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబెల్ మీడియా చెర్ పర్సన్ గా సతీష్ రాజు కి నేడు భాద్యతలు అప్పగించారు.ఈ సందర్బంగా సతీష్ రాజు మాట్లాడుతూ నా మీద నమ్మకం తో భాద్యతలు అప్పగించిన లయన్స్ డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.మరింత భాద్యతతో రానున్న 2025-26 సం.లయన్స్ సేవలు అందరికి తెలియజేసేందుకు మరింత కృషి చేస్తానని తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *