

గరుడ న్యూస్ పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు వివిధ డిమాండ్లతో చేపట్టిన ఆందోళన కార్యక్రమం సోమవారం 10వ రోజుకు చేరుకుంది. పుంగనూరు పురపాలక కార్యాలయం వద్ద ప్లకార్డులను ప్రదర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని సంఘ నాయకుడు శ్రీరాములు కోరారు.