

పార్వతీపురం, గరుడ న్యూస్ : ఏపీ ఉపాధి కల్పనా మరియు వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డిని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర బుధవారం కలిశారు. అమరావతి లోని సీడాప్ కార్యాలయంలో దీపక్ రెడ్డి ని కలిసిన ఎమ్మెల్యే, పార్వతీపురం నియోజకవర్గంలో తమ సంస్థ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పార్వతీపురంలో నిరుద్యోగులు, చిరు వ్యాపారులు చాలామంది ఉన్నారని వారికి సహకారం అందించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సీడాఫ్ చైర్మన్ దీపక్ రెడ్డి అనుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు
